మెగా అభిమానులకు గుడ్ న్యూస్..ఓటీటీలో ఫ్రీగా ఆర్​ఆర్ఆర్ మూవీ

0
48

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన భారీ చిత్రం ఆచార్య. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ లాహే లాహే పాటలో నటించిన తరువాత ఈ సినిమా నుంచి తీసివేయడం జరిగింది. రామ్ ​చరణ్ జతగా పూజాహెగ్డే నటించారు. భారీ అంచనాలతో ఈ సినిమా ఏప్రిల్ 29 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయి ప్రేక్షకులను సంతోషపెట్టింది.

కానీ అనుకున్న మేరకు కల్లెక్షన్స్ సాదించలేకపోవడంతో చిత్రబృందం నిరాశ పర్చిన విషయం తెలిసిందే. గత నెలలో రిలీజ్ అయిన ఈసినిమా ఎలాగూ ప్లాప్ అయ్యింది కనుక కనీసం ఓటీటీ లో అయినా త్వరగా విడుదల చేస్తే అభిమానులకు కాస్త ఊరట కలుగుతుందని ఉద్దేశ్యంతో ఓటీటీలో ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తున్నారు.

తొలుత పే ఫర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమా జీ5లో ఈనెల 20న విడుదల చేయాలనీ అనుకుంటున్నా నేపథ్యంలో జీ5 సబ్​స్క్రైబర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం వల్ల ఈ సినిమా జీ5 సబ్​స్క్రైబర్లు ఉచితంగానే చూడొచ్చని అద్భుతమైన శుభవార్త చెప్పింది. కానీ సబ్​స్క్రిప్షన్​ లేనివాళ్లు కచ్చితంగా ప్రీమియం రూ. 100 చెల్లించి సినిమాను చూడాల్సి ఉంటుందని జీ5 చెప్పింది.