Guntur Kaaram | ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లొకేషన్ ఫిక్స్

-

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే ఏకంగా 25 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇందులో మహేశ్ లుక్, డైలాగ్స్, డ్యాన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సంగీత దర్శకుడు థమన్ అందించిన బీజీఎం అయితే సూపర్బ్ అనే చెప్పాలి.

- Advertisement -

“మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారు అని అంటున్నారు” అనే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. “గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలుకకు తగిలింది అనుకో.. కళ్లలోంచి వచ్చేది నీళ్లే”… “ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ.. ఇప్పుడు పిలిపించి.. ఇస్త్రీ చీర వేసుకుని మరీ కొడుతుంది” అనే డైలాగ్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మొత్తానికి ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించిందనే చెప్పుకోవచ్చు.

ఇక ఈ సినిమాలో మహేశ్ తల్లిగా రమ్యకృష్ణ(Ramya Krishna), తండ్రిగా జయరామ్, విలన్‌గా ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు నటించారు. ఇదిలా ఉంటే తాజాగా ‘గుంటూరు కారం(Guntur Kaaram)’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరగనుందో అధికార ప్రకటన వచ్చేసింది. రేపు(మంగళవారం) సాయంత్రం 5 గంటల తర్వాత గుంటూరులోని నంబూరు ఎక్స్ రోడ్స్‌లో ఈ ఈవెంట్ జరగనుందని చిత్ర బృందం ప్రకటించింది. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల కానుంది.

Read Also: ఈ చిన్నచిన్న ఆహారపు అలవాట్లతో గుండె ఆరోగ్యం పదిలం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...