Guntur Kaaram | మహేష్ బాబు ఫ్యాన్స్ కి అలర్ట్.. ‘గుంటూరు కారం’ నుండి సూపర్ అప్డేట్

-

త్రివిక్రమ్ మహేష్ బాబు హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘గుంటూరు కారం(Guntur Kaaram) ‘. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రమ్య కృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న గుంటూరు కారం సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధం చేశారు మేకర్స్. విడుదల కి దగ్గర పడుతున్న నేపథ్యంలో అభిమానులకు సినిమా గురించి మేకర్స్ మరో కీలక అప్డేట్ ఇచ్చారు.

- Advertisement -

గుంటూరు కారం మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను ఈ రోజు రాత్రి 9 గంటల 9 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అభిమానులు 9:09 ఎప్పుడు అవుతుందా అంటూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కుర్చీ మడతపెట్టి సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సాంగ్ లో శ్రీలీల(Sreeleela)కి పోటీగా మాస్ స్టెప్పులతో అదరగొట్టారు మహేష్(Mahesh Babu). ఇక ట్రైలర్ ఇంకెంత దుమ్ము లేపుతుందో వేచి చూడాలి. కాగా, గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

Read Also: “ఇక రాజులమ్మ జాతరే.. ఈపాలి ఏట గురితప్పేదేలే” అంటున్న చైతూ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...