Rajadhani Files | ‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ 

-

‘రాజధాని ఫైల్స్‌’ (Rajadhani Files) సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్ర నిర్వాహకులు సమర్పించిన సెన్సార్‌ బోర్డు రివైజింగ్‌ కమిటీ ధ్రువపత్రాలను పరిశీలించిన న్యాయస్థానం స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని స్పష్టంచేసింది. దీంతో మూవీ రిలీజ్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయాయి. కోర్టు ఆదేశాలతో సినిమా విడుదలకు మేకర్స్ సన్నాహాలు మొదలుపెట్టారు.

- Advertisement -

కాగా సీఎం జగన్‌తో పాటు వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఒకరోజు మూవీ రిలీజ్‌పై స్టే విధించింది. సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ వివరాలను సమర్పించాలని నిర్వాహకులను ఆదేశించింది. ఈరోజు విచారణ సందర్భంగా మేకర్స్ వివరాలు సమర్పించడంతో మూవీ(Rajadhani Files) విడుదలకు అనుమతి ఇచ్చింది.

Read Also: తిరుపతి జూ పార్క్‌లో దారుణం.. వ్యక్తిని చంపేసిన సింహం.. 
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా...

YS Vijayamma: షర్మిలకు మద్దతు ప్రకటించిన తల్లి విజయమ్మ 

ఏపీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం...