Chiranjeevi | పద్మవిభూషణ్ పురస్కారం రావడంపై చిరంజీవి ఎమోషనల్

-

‘పద్మవిభూషణ్‌’ అవార్డ్ దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) భావోద్వేగానికి గురయ్యారు. ఈ అవార్డుపై స్పందిస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

- Advertisement -

“ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. నన్ను మీ అన్నయ్యలా, బిడ్డలా భావించే కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండల వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. 45 సంవత్సరాల సినీ ప్రస్ధానంలో వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను” అని పేర్కొన్నారు.

నిజ జీవితంలో నా చుట్టూ ఉన్న సమాజంలో అవసరమైనపుడు కూడా చేతనైనా సాయం చేస్తున్నాను. నాపై ప్రజలంతా చూపిస్తున్న అభిమానానికి ప్రతిగా నేను ఇచ్చేది గోరంతే అని అదే బాధ్యతగా నన్ను ముందు నడిపిస్తుంది. పద్మవిభూషణ్(Padma Vibhushan) వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డుకు నన్ను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. మరోవైపు చిరు(Chiranjeevi)కు అన్ని రంగాల ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also: వెంకయ్యనాయుడు, చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...