సినిమాల నుంచి పార్లమెంట్ వరకూ వెళ్లిన మన తెలుగు నటులు వీరే

సినిమాల నుంచి పార్లమెంట్ వరకూ వెళ్లిన మన తెలుగు నటులు వీరే

0
39

డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యా అంటారు చాలా మంది నటులు, అలాగే సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత చాలా మంది రాజకీయాల్లో కూడా తమ జాతకం ఎలా ఉందో చూసుకున్నారు, కొందరు సక్సెస్ అయితే మరికొందరు ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు, కొందరు ఎంపీలు అయ్యారు, కేంద్రంలో మంత్రులు అయ్యారు. రాష్ట్రంలో మంత్రులు అయ్యారు. ఎమ్మెల్యేలు అయ్యారు.

అంతేకాదు పార్టీ పెట్టి సీఎం అయిన వారు ఉన్నారు, అయితే మన తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాల నుంచి రాజకీయల్లో ఎంట్రీ ఇచ్చి ఎంపీలు అయి పార్లమెంట్ కు వెళ్లిన వారు ఎవరు అనేది ఓసారి చూద్దాం

1. భరత్ మార్గాని రాజమండ్రి ఎంపీ
2.మురళీమోహన్ మాజీ ఎంపీ రాజమండ్రి
3.చిరంజీవి రాజ్యసభకు ఎంపికయ్యారు
4.కృష్ణ ఏలూరు నియోజకవర్గం నుండి ఎంపీగా గతంలో చేశారు
5.కృష్ణం రాజు కేంద్రమంత్రిగా బీజేపీలో చేశారు
6.మోహన్ బాబు రాజ్యసభకు వెళ్లారు
7.దాసరినారాయణ రావు కేంద్రమంత్రిగా చేశారు కాంగ్రెస్ లో
8.జయప్రద ఎంపీగా గెలిచారు
9.శివప్రసాద్ చిత్తూరు ఎంపీగా పనిచేశారు
10. మచిలిపట్నం నుంచి కైకాల సత్యనారాయణ టీడీపీ నుంచి గెలుపొందారు ఎంపీగా
11.శారదా తెనాలి నుండి లోక్సభ పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు టీడీపీ తరపున