ఇద్దరు హీరోయిన్లతో చైతూ రొమాన్స్….

ఇద్దరు హీరోయిన్లతో చైతూ రొమాన్స్....

0
45

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందని స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య దర్శకుడు విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తున్నాడు… దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి థ్యాంక్స్ అనే వర్కింగ్ టైటిల్ ను నిర్ణయించారు.. గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మనం చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే…

ఈ చిత్రం అక్కనేని ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తే ఉంటుంది… అలాంటి దర్శకుడితో ఇప్పుడు చైతు మరో సినిమా చేస్తున్నాడు… ఈ చిత్రంలో చైతూ ఇద్దరు అమ్మాయిలతో రొమాన్స్ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి… వీరిలో ఒకరు పంజాబ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కాగా మరోకరు తమిళ ముద్దుగుమ్మ ప్రియా భవానీ శంకర్ ను తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి…

ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రియాతో సంప్రదింపులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఇక ఈ సంప్రదింపులు పూర్తి అయిన తర్వాత కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత అక్టోబర్ లో షూటింగ్ మొదలు పెట్టే అవకాశలు ఉన్నాయని ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి… కాగా రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో రకుల్ చైతుకు జోడీగా నటించింది.. ఈ చిత్రం సూపర్ హాట్ అయిన సంగతి తెలిసిందే…