ప్రముఖ హీరోయిన్ కిన్నెర ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా

ప్రముఖ హీరోయిన్ కిన్నెర ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా

0
37

కిన్నెర టాలీవుడ్ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ..అంతేకాదు ఆమె తెలుగులో చాలా సినిమాల్లో నటించింది,
కూచిపూడి నాట్యంలో ఆమె ఎంతో పేరు సంపాదించారు, నటిగా, సహ నటిగా ఎనిమిది టీవీ నంది అవార్డులు అందుకున్నారు ఆమె, అనేక వేదికలమీద నాలుగు వేలకి పైగా కూచిపూడి నృత్యప్రదర్శనలు ఇచ్చి రికార్డు సృష్టించారు.

కిన్నెరది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి…రంగస్థల, సినీనటి లలితారాణి కుమార్తె , ఆమె అసలు పేరు దేవి.
భరతకళాప్రపూర్ణ కోరాడ నరసింహారావు దగ్గర ఈమె నాట్యం నేర్చుకొనేవారు. ఇలా నాట్యం నేర్చుకున్న సమయంలో ప్రముఖ నటుడు పేకేటి శివరామ్ మిత్రులు, నిర్మాత పి.వి.రావు ఈమెను చలనచిత్రరంగానికి పరిచయం చేశారు.

చిరంజీవితో రుస్తుం, దొంగ మొగుడు లాంటి సూపర్హిట్ చిత్రాలను అందించిన నిర్మాత ఎస్.పి.వెంకన్నబాబు ఈమె పేరును భలే మొగుడు సినిమాతో కిన్నెరగా మార్చారు. 1992లో బ్రహ్మానందం హీరోగా నటించిన బాబాయ్ హోటల్ మంచి పాత్రలో చేశారు ఆమె.. ఈ సినిమా ఆమెకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది..చెట్టుకింద ప్లీడర్ చిత్రంలో హీరోయిన్గా చేశారు.

ఓ స్త్రీ సంకెళ్లు తెంచుకో,పువ్వు, కథానాయిక మొల్ల, విధి, అంతరంగాలు, శివరంజని ఇలాంటి టాప్ సీరియల్స్ లో ఆమె నటించారు…2005వ సంవత్సరంలో కిన్నెరకు వివాహం జరిగింది. ఆమె భర్త పేరు ఫణికుమార్. కంప్యూటర్ హార్డ్వేర్లో ఉద్యోగం. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు పేరు జయసూర్య, పాప పేరు జాబిలి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా కుటుంబంతో ఉంటున్నారు ఆమె.