అంగరంగవైభవంగా రామోజీరావు మనవరాలి పరిణయ మహోత్సవం..

0
40

రామోజీ గ్రూప్‌ ఛైర్మన్‌ రామోజీరావు మనవరాలు బృహతి వివాహం.. దండమూడి అమర్ మోహన్ దాస్, అనితల కుమారుడు వెంకట్ అక్షయ్‌తో శనివారం రాత్రి అంగరంగవైభవంగా జరిగింది. ఈ అపురూప ఘట్టం రామోజీ ఫిల్మ్‌సిటీ లో జరిగింది. అచ్చతెలుగు సంప్రదాయంలో జరిగిన ఈ పెళ్ళికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు.

సినీ నటులు రజనీకాంత్‌, చిరంజీవి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సహా రాజకీయ, న్యాయ, సినీ, వైద్య, పారిశ్రామిక రంగాల ప్రముఖులు హాజరై వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. న్యాయ నిపుణుల దీవెనలు, రాజకీయ ప్రముఖుల ఆశీస్సులు, ఉన్నతాధికారులు, విద్యాసంస్థల అధినేతల శుభాశీస్సులు, సినీ ప్రముఖులు, వైద్య నిపుణులు, వ్యాపార దిగ్గజాల దీవెనలు పొందిన ఈ జంట నిండునూరేళ్ళు చల్లగా ఉండాలని అందరు ఆశీర్వదించారు. ఇలా ఎంతో మంది దీవెనలు స్వీకరించిన ఈ జంట జీవితాంతం ఆనందంగా జీవించాలని అందరు కోరుకుంటున్నారు.