‘సీతారామంకు’ ఫ్యాన్స్ ఫిదా..అందుకే ఈ 4 పేజీల ప్రేమలేఖ..ఎవరు రాశారంటే

0
48

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో బిగ్ హిట్ అయిన లిస్టులో సీతారామం ఒకటి. అద్భుతమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన సీతారామంలో దుల్కర్‌ సల్మాన్‌, మణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించారు. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో మెప్పించారు.

యుద్ధంతో రాసిన ఈ ప్రేమ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్ తక్కువే అయిన ప్రేక్షకులు భారీ హిట్ ను ఇచ్చారు. యుద్ధంతో కూడిన ప్రేమకథ విశేషంగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ విషాదంతంతో కూడడం ఈ సినిమా భిన్నమైందిగా నిలిచిపోయింది.

తాజాగా విదేశీయులు సైతం ఈ చిత్రాన్ని చూసి ఫిదా అవుతున్నారు. ఇక మోనికా అనే పోలాండ్​కు చెందిన అభిమాని.. ఈ చిత్రంపై తన ప్రేమను తెలియజేస్తూ నాలుగు పేజీల లేఖను రాసి ట్విట్టర్​ వేదికగా పోస్ట్​ చేసింది. ” సీతారామం చిత్ర యూనిట్​కు పోలాండ్​ నుంచి లేఖ రాస్తున్నాను. ఈ లేఖను ఎవరైనా చదువుతారా, లేదా అన్నది నాకు తెలియదు. కానీ ఈ చిత్రంపై నా ప్రేమను, అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను” అని పోస్ట్​లో తెలిపింది.

లేఖలో ఏముందంటే..?

“నేను లెఫ్టినెంట్ రామ్​తో ప్రేమలో పడిపోయాను.. అతడిని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను. ఇంత అద్భుతమైన పాత్రను సృష్టించారు చిత్ర యూనిట్​. అలాగే సీత పాత్రలో మృణాల్​ను తప్ప మరెవరినీ ఊహించుకోలేకపోతున్నాను. మృణాల్… మీరు నా మనసును గెలుచుకున్నారు. ప్రతి ఫ్రేమ్​లో ఎంతో అందంగా కనిపించారు. మిమ్మల్ని చూస్తే ఓ అందమైన దేవకన్యగా అనిపించారు. అలాగే మీకు గాత్రం అందించిన సింగర్ చిన్మయి శ్రీపాద లేకుండా సీతామహాలక్ష్మీ అసంపూర్ణం. సీతారామం చిత్రయూనిట్‏కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చింది.