Guntur Kaaram | మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో భారీ మార్పులు!

-

సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ వస్తోన్న సినిమా గుంటూరు కారం(Guntur Kaaram). ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, పూజా హెగ్డేలు సందడి చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తీస్తున్న ఈ సినిమాను చినబాబు, సూర్య దేవర నాగ వంశీ నిర్మించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ చక్కని ఆదరణ పొందుతోంది. అయితే.. అనూహ్యంగా ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. చిత్ర దర్శకుడు త్రివిక్రమ్, మహేశ్ బాబే తమన్‌ను తొలగించారనేది సమాచారం. తమన్(Thaman) సినిమా నుంచి వైదొలగిన విషయంలో అందరూ ఎవరికి తోచినట్టువారు కారణాలు చెబుతున్నారు. కానీ మహేశ్ బాబుతో విబేదాల కారణంగానే తమన్‌ను తప్పించినట్టు ప్రధానంగా విన్పిస్తోంది. గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా సంగీతం నుంచి తమన్‌ను తప్పించారు సరే మరి ఆ స్థానంలో ఎవరు సంగీతం సమకూరుస్తారనేది ఆసక్తిగా ఉంది.

- Advertisement -
Read Also:
1. బాక్సాఫీస్ వద్ద ‘ఆదిపురుష్’ కలెక్షన్ల సునామీ
2. మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...