Bandi Sanjay | ప్రజల ఉసురు పోసుకునేందుకే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారా?

-

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో తీవ్ర విషాదం నెలకొంది. హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం మర్పెల్లిగూడెంలో విద్యార్థులతో ర్యాలీ తీస్తుండగా ట్రాక్టర్ కింద పడి 6వ తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్(10) దుర్మరణం చెందాడు. బాలుడి మృతిపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. ‘తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో(Telangana Dashabdi Utsavalu) కమలాపూర్ మండలం మర్పెల్లిగూడెంలో 6వ తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్ దుర్మరణం దిగ్భ్రాంతికరం. బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. స్కూల్‌లో చదువుకుంటున్న విద్యార్ధిని దశాబ్ది ఉత్సవాలకు తీసుకొచ్చిన ప్రభుత్వమే ఈ మృతికి బాధ్యత వహించాలి. తక్షణమే బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలి. ప్రజల ఉసురు పోసుకునేందుకే బీఆర్ఎస్ సర్కార్(BRS Govt) దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందా? ఈ ఉత్సవాల్లో పాల్గొనేలా ప్రభుత్వ యంత్రాగంపై ఒత్తిడి తెస్తున్న ఈ సర్కార్ విద్యార్థులను సైతం బలవంత పెట్టడం దారుణం. ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్న చిన్నారి విగతజీవిగా మారడానికి కారణమెవరు? ఆ తల్లితండ్రుల బాధను ఎవరు తీరుస్తారు? ఏం చెప్పి వారిని ఓదారుస్తారు’ అని సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి(Bandi Sanjay) ప్రశ్నించారు.

- Advertisement -
Read Also:
1. అది నిరూపిస్తే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: జీవన్ రెడ్డి
2. అంగన్వాడీల అక్రమాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మందుబాబులకు షాక్.. మూడు రోజులు మద్యం షాపులు బంద్..

Liquor Shops | తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. వేసవి...

AB Venkateswara Rao | ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట.. సస్పెన్షన్ ఎత్తివేత

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు(AB Venkateswara Rao) ఊరట దక్కింది....