Rajamouli Mahabharata | రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహా భారతం’పై క్లారిటీ

-

Rajamouli Mahabharata | దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహా భారతం’. ఇదే తన చివరి సినిమా అని కూడా రాజమౌళి అనేకసార్లు చెప్పారు. కానీ, ఎప్పుడు మొదలు పెడతాడు.. ఎన్ని పార్ట్స్ తీస్తాడు అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహా భారతంపై రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ‘‘మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో రానున్న సినిమా ఒక అడ్వెంచర్ మూవీ. దీన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం. RRR చిత్రాన్ని మించి ఈ సినిమా ఉండనుంది’’ అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

- Advertisement -

Rajamouli Mahabharata | అలాగే ఎన్టీఆర్-రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ సిద్ధం చేస్తున్నాం. ఒక హాలీవుడ్ చిత్రంగా దీన్ని తెరకెక్కించాలనుకుంటున్నాం. మహేశ్ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం అని రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్‌తో జక్కన్న సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రాజమౌళి పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని టాక్. అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో కథ ఉండనుంది.

Read Also: మీడియాపై మోహన్ బాబు దురుసు ప్రవర్తన

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...