Yatra 2 Trailer | నేను విన్నాను.. నేను ఉన్నాను.. యాత్ర2 ట్రైలర్ విడుదల..

-

Yatra 2 Trailer |ఏపీ సీఎం జగన్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర 2‘ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఓ పేద మహిళ తన కూతురి ఆపరేషన్ కోసం వైఎస్సార్ వద్దకు వస్తే ఆరోగ్యశ్రీ పథకం ఆలోచనతో ట్రైలర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత వైఎస్సార్ మరణం, జగన్ జైలు జీవితం, ఆ తర్వాత జరిగిన రాజకీయాలు, జగన్ జనాల్లోకి వెళ్లడం.. లాంటి అంశాలతో ట్రైలర్ సాగింది. చివర్లో వైఎస్సార్ లాగే జగన్ కూడా నేను విన్నాను.. నేను ఉన్నాను అనే డైలాగ్‌తో ముగించారు.

- Advertisement -

తమిళ హీరో జీవా(Jiiva) జగన్ పాత్రలో నటించగా.. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్‌ కనిపించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

Yatra 2 Trailer | కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘యాత్ర 2’ సినిమాను రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 8న మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Read Also: నేను చనిపోలేదు.. బతికే ఉన్నాను: పూనమ్ పాండే
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...