Bharat Rice | రూ.29లకే భారత్‌ రైస్‌ను ఎలా కొనుగోలు చేయాలంటే..?

-

బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరగడంతో తక్కువ ధరలకే బియ్యం అందించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. ‘భారత్ రైస్'(Bharat Rice) పేరిట రూ.29లకే కిలో బియ్యం విక్రయాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ఈ పథకాన్ని ప్రారంభించారు. 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో ఈ రైస్‌ను అందుబాటులో తీసుకువచ్చారు. ఇందుకోసం తొలి దశలో 5లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ కేటాయించింది.

- Advertisement -

తొలి విడతలో నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NCCF), కేంద్రీయ భండార్ ద్వారా అమ్మకాలు జరపనుంది. ఈ రైస్ బ్యాగులు కావాలనుకునే వారు https://www.nafedbazaar.com/product-tag/online-shopping వెబ్‌సైట్‌లోకి వెళ్లి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సైట్‌లో బియ్యం(Bharat Rice)తో పాటు పప్పు, శనగపిండి వంటి ఇతర ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇతర ఈ-కామర్స్ సైట్లలో కూడా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే గోధుమపిండి కిలో రూ.27.50, భారత్‌ శనగ పప్పును రూ.60 చొప్పున విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

Read Also: ‘హనుమాన్’ సరికొత్త రికార్డ్.. 25 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...