ఈడీ సంచలన నిర్ణయం.. రూ.400 కోట్ల ఆస్తులను అటాచ్

-

Nowhera Shaikh Case |నౌహీరా షేక్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. దాదాపు రూ.400 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. హీరా గోల్డ్, నౌహీరా షేక్ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది. మొత్తం 24 ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా రూ.33 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. కాగా, అధిక మొత్తంలో తిరిగి చెల్లింపులు చేస్తామని చెప్పి ప్రజల నుంచి నౌహీరా షేక్ రూ.5 వేల కోట్లు వసూలు చేసి వాటిని వివిధ సంస్థల్లోకి మళ్లించారనే ఆరోపణలు నౌహీరా షేర్ ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై 2018లో ఈడీ నౌహీరా సంస్థలపై మనీలాండరింగ్ కేసు(Nowhera Shaikh Case) నమోదు చేసింది. డిపాజిటర్లను మోసం చేసిన కేసులో నౌహీరా షేక్‌ను 2018 అక్టోబర్ 17న హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 15 కంపెనీలకు నౌహీరా షేక్ ఛైర్మెన్‌గా కొనసాగుతున్నారు. వేర్వేరు పేర్లతో ఈ కంపెనీలు నడిపారు.

- Advertisement -
Read Also: అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు: సీతక్క

Follow us on:  Google News  Koo Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...