ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తాం: కేటీఆర్

-

Minister KTR |ఎల్బీనగర్ చౌరస్తాకు తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. శనివారం నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సార్‌డీపీలో భాగంగా ఎల్బీనగర్‌లోనే 12 ప్రాజెక్టులు చేపట్టినట్టుగా తెలిపారు. ఈరోజు 9వ ప్రాజెక్టును ప్రారంభించినట్టుగా చెప్పారు. మిగతా మూడు ప్రాజెక్టులను కూడా సెప్టెంబర్‌లోపు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఫ్లై ఓవర్‌లు పూర్తికావడంతో.. ఎల్‌బీ నగర్ చౌరస్తా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తయారైందని చాలా మంది చెబుతుందని అన్నారు. అయితే ప్రజా రవాణా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నాగోల్‌ మెట్రోను ఎల్బీ నగర్‌కు జోడిస్తామని చెప్పారు. అలాగే మెట్రోను హయత్‌నగర్‌ వరకు విస్తరిస్తామని కేటీఆర్(Minister KTR) తెలిపారు. వచ్చే టర్మ్‌లో ఆ పనిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -
Read Also: ఈడీ సంచలన నిర్ణయం.. రూ.400 కోట్ల ఆస్తులను అటాచ్

Follow us on: Google News , Koo , Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...