Tamil Nadu | తమిళనాడులో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం

-

తమిళనాడు(Tamil Nadu).. కృష్ణగిరి పాతపేటలో బాణసంచా భద్రపరచిన గోదాం(Firecracker Unit)లో భారీగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తొంది. మరోవైపు ఈ గోదాం నివాస సముదాయాల మధ్యలో ఉండటం వల్ల పేలుడు ధాటికి మూడు ఇళ్లు కుప్పకూలాయి. ఈ శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Tamil Nadu | ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read Also: పవన్ కల్యాణ్ ‘బ్రో’ వివాదం.. స్పందించిన మంత్రి అంబటి
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...