ప్రధాని సర్టిఫికేట్లతో నీకేం పని.. ఢిల్లీ సీఎంకు హైకోర్టు షాక్!

-

ప్రధాని నరేంద్ర మోడీ(Modi)కి సంబంధించిన డిగ్రీ, పీజీ స‌ర్టిఫికేట్లు కావాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పిటిషన్ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన గుజ‌రాత్ హైకోర్టు తీర్పును వెలువ‌రించింది. ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు రూ.25వేల ఫైన్‌ విధించింది. ప్రధాని మోడీకి చెందిన డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ స‌ర్టిఫికేట్లను ప్రధాన‌మంత్రి కార్యాల‌యం(PMO) బ‌హిర్గతం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని గుజ‌రాత్ హైకోర్టు త‌న తీర్పులో వెల్లడించింది. జ‌స్టిస్ బీరెన్ వైష్ణవ్ నేతృత్వంలోని ఏక‌స‌భ్య ధ‌ర్మాస‌నం ఈ తీర్పును వెలువ‌రించింది. గుజ‌రాత్ యూనివ‌ర్సిటీతో పాటు ఢిల్లీ యూనివ‌ర్సిటీలు ప్రధాని మోదీ డిగ్రీ, పీజీ స‌ర్టిఫికేట్లను స‌మ‌ర్పించాల‌ని చీఫ్ ఇన్ఫర్మేష‌న్ క‌మిష‌న్ ఇచ్చిన ఆదేశాల‌ను సింగిల్ జ‌డ్జి బెంచ్ కొట్టిపారేసింది.

- Advertisement -
Read Also: ఈసారి సమంత పేరు ప్రస్తావించిన రేవంత్.. కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nominations | ఏపీ, తెలంగాణలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ...

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్: సీఎం రేవంత్ రెడ్డి

20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై...