Golden Temple | గోల్డెన్ టెంపుల్‌లో గన్ షాట్స్.. మాజీ సీఎం టార్గెట్..

-

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌(Golden Temple)లో కాల్పులు కలకలం రేపాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌(Sukhbir Singh Badal) టార్గెట్‌గా ఈ కాల్పులు జరిగాయి. సుఖ్‌బీర్.. సేవాదార్‌గా శిక్ష అనుభవిస్తున్న క్రమంలో ఈ కాల్పులు జరిగాయి. ఆయనపై కాల్పులు జరిగిన గుర్తు తెలియని వ్యక్తులను కనుగొనడం కోసం అధికారులు గాలింపు చేపట్టారు.

- Advertisement -

తన శిక్షలో భాగంగా చక్రాల కుర్చీలో ఆలయ ప్రవేశద్వారం దగ్గర సుఖ్‌బీర్ కాపలాదారుగా ఉన్నారు. ఆయన సమయంలోనే ఓ వృద్ధుడు ఆయన దగ్గరకు వచ్చాడు. కొన్ని అడుగుల దూరంలో ఉన్నప్పుడు ఒక్కసారి తన జేబు నుంచి తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. అది గమనించిన సుఖ్‌బీర్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే దాడిని అడ్డుకుని సుఖ్‌బీర్‌ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.

Golden Temple | అంతేకాకుండా కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్న భద్రతా సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో సుఖ్‌బీర్‌కు ఎటువంటి హానీ జరగలేదు. నిందితుడిని నరైన్ సింగ్ చౌరాగా పోలీసులు గుర్తించారు. అతడు గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రముఠాలో పనిచేసినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.

Read Also: హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి సోమవారం..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...