రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 40 చోట్ల ఐటీ సోదాలు

-

TamilNadu |తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. చెన్నై, కోయంబత్తూరు, కరూర్ జిల్లాల్లో ఏకకాలంలో 40 చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు, ఐటీ రిటర్న్స్ దాఖలుకు సంబంధించిన పత్రాలను ఇన్‌కం ట్యాక్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సోదాలు ప్రారంభించారు. కాగా, మంత్రి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడుల సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. సెంథిల్ కుమార్ నివాసంలో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన ఐటీ అధికారుల వాహనాలను డీఎంకె నేతలు ధ్వంసం చేశారు. అనంతరం ఐటీ అధికారులతో డీఎంకె నేతలు వాగ్వాదానికి దిగారు. ఐటీ అధికారుల బృందంలో ఉన్న మహిళ అధికారిని డీఎంకె(DKM) శ్రేణులు అడ్డుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...