స్కూల్లోనే కొట్టుకున్న టీచర్-ప్రిన్సిపాల్.. వీడియో వైరల్

-

విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులే దారి తప్పారు. విద్యార్థుల ముందే ఒకరిపై ఒకరు కలబడి చెప్పులతో కొట్టుకున్నారు. బీహార్‌లోని(Bihar) పాట్నా జిల్లా కౌరియా పంచాయతీలోని బిహ్తా మిడిల్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. తొలుత తరగతి గదిలో టీచర్ అనితా కుమారి, ప్రిన్సిపాల్ కాంతి కుమారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ బయటకొచ్చి కిందపడి మరి కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన అధికారులు వ్యక్తిగత కారణాలతోనే వారిద్దరూ గొడవపడినట్లు తెలిపారు. వారిద్దరికీ నోటీసులు ఇచ్చామని.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి ఆదేశాల ప్రకారం ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

- Advertisement -

Read Also:
1. అమెరికా అధ్యక్షుడి హత్యకు యత్నించిన తెలుగు యువకుడికి భారీ శిక్ష
2. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వానికి కొత్త చిక్కులు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pushpa 2 | బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. 'పుష్ప2(Pushpa...

సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్..

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)...