భారతీయుడిగా నా ఓటును వినియోగించుకున్నా: కిచ్చా సుదీప్

-

ఈ ఉదయం ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బరిలో ఉన్న 2,165 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 5.31 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో కన్నడ అగ్ర కథానాయకుడు కిచ్చా సుదీప్(Kiccha Sudeep) ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగళూరులోని ఎన్నికల పోలింగ్ బూత్‌‌లో ఆయన ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సమస్యలు వ్యక్తిగతమైనవని, వాటిని దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలన్నారు. తాను సెలబిట్రీగా పోలింగ్ బూత్‌కు వెళ్లలేదని, ఓ భారతీయుడిగా వెళ్లానని చెప్పారు. ఓటు వేయడం తన బాధ్యతని సుదీప్ పేర్కొన్నారు.

- Advertisement -
Read Also: ఎవరు ఎంత నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...