‘ఐటీ పరిశ్రమలే ఒత్తిడి తెస్తున్నాయ్’.. మంత్రి హాట్ కామెంట్స్

-

ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పని గంటలకు పెంచాలన్న ప్రతిపాదన కర్ణాటక(Karnataka) అంతటా హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ ఆలోచనను ఐటీ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ సంస్థలు మాత్రం దీనిని అమలు చేయాలని, ఉద్యోగి పని గంటలను రోజుకు 14 గంటలకు పెంచాలని భావిస్తున్నాయి. తాజాగా ఈ ప్రతిపాదనపై రాష్ట్రప్రభుత్వ తీర్మానం చేయడం ఐటీ ఉద్యోగుల్లో ఆందోళనను అధికం చేసింది. ఈ ప్రతిపాదనపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్(Santhosh Lad) కీలక వ్యాఖ్యలు చేశారు. పని గంటలు పెంచాలని తమ ప్రభుత్వంపై ఐటీ సంస్థలే ఒత్తిడి తెస్తున్నాయని, పని గంటలు పెంచాలన్న ఆలోచన తమది కాదని ఆయన తేల్చి చెప్పారు. చాలా మంది ఈ మేరకు నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే అని భ్రమ పడుతున్నారని, అందులో వాస్తవం లేదని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Karnataka | ‘‘ఉద్యోగుల పని వేళలు పెంచాలంటూ స్వయంగా ఐటీ సంస్థలే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. దీని వల్లే బిల్లు తీర్మానానికి వచ్చింది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై పారిశ్రామికవేత్తలు బహిరంగ చర్చ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు కూడా దీనిపై తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలని కోరుతున్నా. అప్పుడే ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది’’ అని చెప్పారు.

Read Also: ‘బాబాయ్ హత్యపై ధర్నా ఎందుకు చేయలేదు’.. ప్రశ్నించిన షర్మిల
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KP Vivekanand | ఇది కాపీ పేస్ట్ బడ్జెట్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద(KP...

Betting Apps | 2024 లో వెయ్యికిపైనే బెట్టింగ్ వెబ్సైట్స్ బ్యాన్ చేసిన కేంద్రం

Betting Apps | దేశంలో ఆన్‌ లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కార్యకలాపాలను...