ఒడిశా(Odisha) రైలు ప్రమాద ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) స్పందించారు. ప్రమాదంలో మరణించిన తమ రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరుపున ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని(Ex gratia) ప్రకటించారు. తీవ్ర గాయాలపాలైన వారికి ఒక్కొక్కరికి రూ. 1 లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలను ప్రకటించారు. ఈ ప్రమాదంలో బెంగాల్కు చెందిన ప్రయాణికులే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉండవచ్చునని సీఎం మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్రం దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అయితే, ఇది రాజకీయాలు చేసే సమయం కాదని ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన తరుణమని మమత అన్నారు. హెలికాప్టర్ ద్వారా ఒడిశాకు చేరుకున్న మమతా బెనర్జీ(Mamata Banerjee) … కటక్లోని ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.