ఐశ్వర్యరాయ్ కళ్లపై మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్(Aishwarya Rai) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పెళ్లి తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఈ మధ్య మళ్ళీ స్పీడ్ పెంచింది. ఇదిలా ఉండగా ఐశ్వర్య రాయ్ పై మహారాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి విజయ్‌ కుమార్(Minister Vijay Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ధులే జిల్లాలో మత్స్యకారుల సంఘంతో ఓ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మంత్రి గవిత్ చేపల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ.. ‘బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ కళ్లు నిత్యం చేపలు తినడం వల్ల అంత అందంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

చేపలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడమే ఆమె(Aishwarya Rai) అద్భుతమైన కళ్లకు కారణం. చేపలను ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవాలి’ అని ఆమెను ఉదాహరణగా చెప్పడం విశేషం. దీంతో వెంటనే ఈ ప్రకటనపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) శాసనసభ్యుడు అమోల్ మిత్కారీ స్పందిస్తూ ‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కంటే గిరిజన సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది’ అని కోరారు.

Read Also: చిరు కొత్త సినిమాలు అనౌన్స్.. లక్కీ ఛాన్స్ కొట్టిన దర్శకులు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...