Ajit Pawar | మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌

-

మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. శరద్‌పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ రెండు వర్గాలుగా ముక్కలైంది. మహారాష్ట్రలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎన్సీపీ అగ్ర నేత అజిత్‌ పవార్‌(Ajit Pawar) దాదాపు 30 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా ఎగురవేశారు. ఆదివారం మధ్యాహ్నం తన వర్గం ఎమ్మల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. మహారాష్ట్రలోని ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాడు. ఆ వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde), ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, కొంతమంది రాష్ట్ర మంత్రులు ఒకరి వెంట ఒకరు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం అజిత్‌ పవార్‌ను రాష్ట్ర క్యాబినెట్‌లో చేర్చుకుని ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు. అనంతరం మహారాష్ట్ర గవర్నర్‌ రమేశ్‌ బియాస్‌ అజిత్‌ పవార్‌(Ajit Pawar) చేత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. పవార్‌తోపాటు ఆయన వర్గానికి చెందిన చగన్‌ భుజ్‌బల్‌, దిలీప్‌ వాల్సే పాటిల్‌ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ పరిణామాలన్నీ ఒకదాని వెంట ఒకటి చకచకా జరిగిపోయాయి.

- Advertisement -
Read Also:
1. రేణుక చౌదరి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. ఏం చేసిందో తెలుసా?

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...