Mallikarjun Kharge | ఖమ్మం సభపై మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు

-

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా ఖమ్మం జిల్లాలో తలపెట్టిన జన గర్జన సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ హాజరవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ జనగర్జన సభపై ఏఐసీసీ ప్రెసిడెంట్(Mallikarjun Kharge) ఆదివారం ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. జన గర్జన ద్వారా రాహుల్ గాంధీ ప్రజల ఆకాంక్షలను వినిపిస్తారని చెప్పారు. ఇక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ 1360 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన సీఎల్పీ నేత భట్టికి మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. పొంగులేటి(Ponguleti), జూపల్లి(Jupally) వంటి నేతలతో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అవుతోందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సమిష్టి నాయకత్వం పట్ల గర్విస్తున్నామన్నారు. తెలంగాణలో కొత్త అధ్యాయానికి మా బ్లూప్రింట్ రెడీగా ఉందని ఖర్గే(Mallikarjun Kharge) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.

- Advertisement -
Read Also:
1. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌
2. రేణుక చౌదరి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. ఏం చేసిందో తెలుసా?

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...