రాహుల్ కంటే ముందు అనర్హత వేటుపడిన పొలిటీషియన్స్ వీళ్లే..!

-

Rahul Gandhi |లోక్‌సభలో రాహుల్ గాంధీ అనర్హత వేటు వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిని కొందరు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర చర్చ విస్తృతమైంది. రాహుల్ గాంధీ(Rahul Gandhi) కంటే ముందే లోక్‌సభలో అనర్హత వేటుకు గురైన నేతల వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

– తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత 2017లో అనర్హతకు గురయ్యారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 4 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా పడింది. దీంతో ఎమ్మెల్యే పదవికి అనర్హతకు గురయ్యి సీఎం పదవి నుంచి దిగిపోయారు. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు ఆమెను నిర్ధోషిగా ప్రకటించడంతో అవరోధాలన్నీ తొలగిపోయాయి.

– బిహార్‌లోని సరన్ ఎంపీగా ఉన్నప్పుడు ‌ఆర్‌జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్‌లో 2013 సెప్టెంబర్‌లో అనర్హత వేటు పడింది. దాణా కేసులో 5 ఏళ్ల జైలుశిక్షపడడం ఇందుకు కారణమైంది.

– లక్షద్వీప్ మాజీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ ఈ ఏడాది జనవరి 23న డిస్‌క్వాలిఫై అయ్యారు. హత్యాయత్నం కేసులో అతడిని సెషన్స్ కోర్ట్ దోషిగా తేల్చడం, రెండేళ్లకుమించి జైలుశిక్షపడడం ఇందుకు కారణమైంది.

– రామ్‌పూర్ మాజీ ఎంపీ ఆజం ఖాన్ 2019లో విద్వేష ప్రసంగం కేసులో దోషిగా తేలారు. రెండేళ్లకంటే ఎక్కువ జైలుశిక్షపడడంతో అనర్హత వేటుపడింది.

Read Also: అనర్హత వేటుపై రాహుల్ గాంధీ రియాక్షన్ ఇదే

Follow us on: Google News  Koo Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...