Rahul Gandhi | పొలంలో దిగి, ట్రాక్టర్‌తో దున్నిన రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వినూత్న కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఉదయం ఆయన హర్యానాలోని సోనీపట్(Sonipat) సమీపంలోని మదీనా గ్రామంలో పొలంలో దిగి, రైతులతో కలగలిసిపోయి, వరి నాట్లు వేశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాహుల్ గాంధీ శనివారం ఉదయం హిమాచల్ ప్రదేశ్ వెళ్తూ మార్గమధ్యంలో మదీనా గ్రామంలో పొలాల్లో పని చేసుకునేవారిని చూశారు. వెంటనే కారును ఆపి, పొలంలో దిగి, ట్రాక్టర్‌తో దుక్కి దున్నారు. ఆ తర్వాత తన ప్యాంటును మోకాళ్ల పై వరకు మడిచి, పొలంలోకి దిగారు. రైతులు వరినాట్లు వేస్తున్న విధానాన్ని పరిశీలించి, తాను కూడా కొన్ని వరి మొక్కలను తీసుకుని, నాటారు. అనంతరం అక్కడి రైతులతోనూ, కూలీలతోనూ ఆయన(Rahul Gandhi) మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Read Also: గాంధీభవన్ ఎదుట మునుగోడు MLA అభ్యర్థి ధర్నా

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...