shiva statue: ప్రపంచంలోనే ఎత్తైన శివుడు విగ్రహావిష్కరణ

-

shiva statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పరమేశ్వరుడి విగ్రహావిష్కరణ జరిగింది. రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం నేటి నుంచి ప్రజలకు దర్శనం ఇస్తుంది. రాజ్‌ సమంద్‌ జిల్లాలోని నాథ్‌ద్వారాలో నెలకొల్పిన 369 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, ఆధ్యాత్మిక గురువు మెురారి బాపు సమక్షంలో ఆవిష్కరించనున్నారు. ధ్యాన ముద్రలో ఉన్న శివుడు ఉన్నట్లు విశ్వాస్‌ స్వరూపం పేరిట ఈ విగ్రహాన్ని(shiva statue)రూపొందించారు. సుమారు 20 కి.మీ దూరం నుంచి సైతం ఈ విగ్రహం కనిపించే విధంగా ఏర్పాటు చేశారు. తత్‌ పదం సంస్థాన్‌ ట్రస్టీ, మిరాజ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ మదన్‌ పాలీవాల్‌ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. దాదాపు 3 వేల టన్నుల ఇనుము, ఉక్కు, 2.5లక్షల టన్నుల కాంక్రీట్‌, ఇసుక వినియోగించటంతో పాటు దాదాపు 10 ఏళ్లపాటు శ్రమించి నిర్మాణాన్ని పూర్తి చేశారు.

- Advertisement -

Read also: ఏపీకి కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిపివేస్తాం?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...