ప్రధాని మోడీపై యూపీ సీఎం ప్రశంసల జల్లు

-

ప్రధాని మోడీ సర్కార్‌పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ(Modi) నాయకత్వంలో అభివృద్ధిలో దేశం అత్యున్నత శిఖరాలు అదరోహించిందని అన్నారు. శుక్రవారం కౌశంబిలో నిర్వహించిన కార్యక్రమంలో యోగి మాట్లాడారు. భారత్‌లో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించారని చెప్పారు. దాయాది దేశం పాకిస్తాన్‌(Pakistan)లో ఆహార సంక్షోభం కొనసాగుతున్న సమయంలో.. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని తెలిపారు. ప్రధాని మోడీ ఇచ్చిన స్ఫూర్తితో యువత క్రీడల్లో భాగస్వామ్యం అవుతున్నారని చెప్పారు. కౌశంబి(Kaushambi) ప్రాంతం చార్రిత్రాత్మక నేపథ్యం కలిగి ఉందని, రాముడు కూడా ఒక రాత్రి బస చేశారని భావిస్తున్నట్లు అన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే 2025 కుంభ మేళాకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలని, అందుకు ప్రజలు, అధికారులు సహకరించి సహకరించాలని ముఖ్యమంత్రి యోగి(Yogi Adityanath) సూచించారు.

- Advertisement -
Read Also: ‘మోడీ సభకు వస్తే కేసీఆర్‌కు గజమాలతో సన్మానం చేస్తా’

Follow us on: Google News, Koo,Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...