చెన్నై ఎయిర్ పోర్టులో పాముల కలకలం

-

చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు(Chennai airport)లో పాముల కలకలం రేగింది. కౌలంలపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి లగేజ్ బ్యాగుల్ని తనిఖీ చేస్తున్న కస్టమ్స్ అధికారులు బిత్తెరపోయారు. ఆమె బ్యాగులలో విషపూరితమైన 22పాములను గుర్తించారు. అందులో 10అడుగులకు పైగా పొడవైన పాములు ఉండడం చూసి షాక్ అయ్యారు. పాములతో పాటు ఓ ఊసరవెల్లిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మహిళను అరెస్ట్ చేశారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన అధికారులు వాటిని అక్కడ నుంచి తరలించారు. కాగా ఈ ఏడాది జనవరిలో కూడా బ్యాంకాక్ నుంచి ఓ ప్రయాణికుడి దగ్గర పాములు, కోతులు, తాబేళ్లు ఉన్న కంటైనర్లు బయటపడిన సంగతి తెలిసిందే.

- Advertisement -
Read Also: ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్ విడుదల

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...

MK Stalin | త్వరగా పిల్లల్ని కనండి.. ఆందోళన వ్యక్తం చేసిన స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే...