ఆంధ్రాబ్యాంకు ని ఈరోజునుంచి మర్చిపోవలసిందే

ఆంధ్రాబ్యాంకు ని ఈరోజునుంచి మర్చిపోవలసిందే

0
38

తెలుగువారి బ్యాంకు అంటే వెంటనే చెప్పేది ఆంధ్రాబ్యాంకు స్టేట్ నేమ్ తో కూడా ఉండటంతో అందరూ దీనిని మన తెలుగు బాంకుగా భావించేవారు. ఇన్నాళ్లు కొనసాగిన ఆంధ్రాబాంక్ అధ్యాయం ఇక ముగిసినట్టే. 97 ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ ఆర్థిక రంగ సంస్ధ నేడు కనుమరుగయింది.

ఇక దేశ వ్యాప్తంగా బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంక్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రావడంతో ఇకపై ఆంధ్రాబ్యాంక్ లోగోకు బదులు యూనియన్ బ్యాంకు లోగో లేదా కొత్త లోగో దర్శనమిస్తుంది.

దీంతో ఈ బ్యాంకుతో ఎంతో అటాచ్ మెంట్ ఉన్నవారు అలాగే ఆనాటి నుంచి బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన వారు ఇక ఆ బ్యాంకు లోగోని మర్చిపోతున్నారు. ఆనాడు స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో ఆంధ్రా బ్యాంక్ను స్థాపించారు. 1980 ఏప్రిల్లో జాతీయ బ్యాంకుగా అవతరించింది. 2019 మార్చి నాటికి 26 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2,885 శాఖలు, 3,798 ఏటీఎంలకు ఆంధ్రాబ్యాంకు విస్తరించింది. 1981లో దేశంలో తొలిసారిగా క్రెడిట్ కార్డుల వ్యాపారాన్ని ప్రారంభించింది ఆంధ్రాబ్యాంకే. అంత చరిత్ర ఈ బ్యాంకుకు ఉంది.