బ్రేకింగ్ – ఏపీలో మ‌రో ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటీవ్

బ్రేకింగ్ - ఏపీలో మ‌రో ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటీవ్

0
25
Covid-19 background. Stop spread and eliminate Coronavirus. Pandemics coronavirus. Epidemic backround. Healthcare background. Hands in blue medical gloves tearing the paper with covid-19 print

ఈ క‌రోనా ఎవ‌రిని విడిచిపెట్డం లేదు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కి డాక్ట‌ర్ల‌కు పోలీసుల‌కు కూడా వైర‌స్ సోకుతోంది, ఏపీలో తెలంగాణ లో చూస్తేప్ర‌జా ప్ర‌తినిధుల‌కి కూడా వైర‌స్ సోకుతోంది, ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేల‌కి వైర‌స్ సోకింది, వారు అంద‌రూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

తాజాగా వైసీపీకి చెందిన మ‌రో ఎమ్మెల్యేకి పాజిటీవ్ వ‌చ్చింది.. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇప్పటికే జిల్లాలో పాజిటివ్ కేసులు బాగా ఉన్నాయి. ఏకంగా ప్రజా ప్రతినిధికే కరోనా సోకడంతో… స్థానికంగా కలకలం రేపింది.

ఆయన భార్య‌కి కూడా పాజిటీవ్ అని తేలింది, ఒంగోలులోని రమేష్ సంఘమిత్ర ఆస్పత్రిలో రాంబాబు, ఆయన భార్య పరీక్షలు చేయించుకున్నారు, ఇప్పుడు ఆయ‌న‌ను క‌లిసిన వారు అంద‌రూ హోం క్వారంటైన్ ఉండాలని చెబుతున్నారు, నిత్యం ప్ర‌జా సేవ‌లో ఉండ‌టంతో నాయ‌కుల‌కి కూడా వైర‌స్ సోకుతోంది.