ఏపీలో నేటి నుంచి కర్ఫ్యూ… మరి బస్సులు తిరుగుతాయా?

ఏపీలో నేటి నుంచి కర్ఫ్యూ... మరి బస్సులు తిరుగుతాయా?

0
40

ఏపీలో నేటి నుంచి కరోనా నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. తాజాగా నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు… నేటి నుంచి కర్ఫ్యూ మధ్యాహ్నం నుంచి అమలు అవుతుంది..మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 

ప్రజా కార్యకలాపాలకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతించాలని నిర్ణయించారు. అంటే పాలు కిరాణా కూరగాయాలు ఇలాంటి వస్తువులు ఈ సమయంలో తీసుకోవాలి, ఇక మధ్యాహ్నం 12 నుంచి ఎవరూ బయటకు రావడానికి లేదు.

 

మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణా వాహనాలను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు.. మధ్యాహ్నం నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులతో పాటు, అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా నిలిచిపోనున్నాయి.

ఎవరైనా రాత్రి పూట జర్నీ ప్లాన్ చేసుకున్నా ఇక క్యాన్సిల్ అవుతాయి.

 

 

 

.