ఏపీ ప్రజలకు జగన్ న్యూ ఇయర్ కానుక

ఏపీ ప్రజలకు జగన్ న్యూ ఇయర్ కానుక

0
129

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటు రాష్ట్ర అభివృద్ది దిశగా అడుగులు వేస్తున్నారు… నవరత్నాల్లో పొందు పరిచిన అంశాలతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు…

తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్… ప్రస్తుతం సొసైటీ పాలు పేపర్, కూరగాయలు ఫుడ్ ఐటమ్స్ వంటివి డోర్ డెలివరీలు ఉంటాయి కానీ ఇప్పుడు ఏపీ సర్కార్ ఇసుకను కూడా డోర్ డెలివరీ చేయనుంది…

జనవరి 2న కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇకపై ఇసుకను డోర్ డెలివరీ చేస్తామని జగన్ తెలిపారు… జనవరి 7న కడప పశ్చిమగోదావరి జిల్లాల్లో డోర్ డెలివరి ఇంటాయని 20లోపు అన్ని జిల్లాల్లో ఇటువంటి సౌకర్యం అందుబాటులోకి తీసుకు వస్తామని అన్నారు..