వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..ఉత్తర్వులు జారీ

0
33

ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దీనితో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, విద్యాకానుక , వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాలతో ప్రజలు లబ్ది పొందుతున్నారు.

ఇక తాజాగా ఏపీలోని మున్సిపాల్టీలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పారిశుధ్య కార్మికులకు ఓహెచ్ఏకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. మున్సిపల్ కార్మికుల 15 వేల వేతనానికి అదనంగా 6 వేలు ఓ హెచ్ ఏను ప్రభుత్వం చెల్లించనునుంది. దాంతో పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ. 21 వేలకు పెరిగినట్టయింది. తాజా ఉత్తర్వుల తో 43 వేల మందికి పైగా కార్మికులకు లబ్ది చేకూరుతుంది.