ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం వారందరికి స్మార్ట్ ఫోన్స్

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం వారందరికి స్మార్ట్ ఫోన్స్

0
42

ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది, ఓ వైపు వైరస్ తో పోరాటం చేస్తూనే మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు.. ముఖ్యంగా విద్యార్దుల విషయంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఏపీ ప్రభుత్వంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది… 9వ తరగతి నుంచి ఇంటర్ వరకూ ఉన్న విద్యార్థులందరికీ… స్మార్ట్ ఫోన్లు ఇవ్వనుంది పాలకమండలి. ఈ ఫోన్ల రేటు రూ.5 వేల నుంచి రూ.6 వేల దాకా ఉండనుంది, దీనికి కారణం కూడా ఉంది

విద్యార్దులకు ఆన్ లైన్ పాఠాలు చెప్పాలని చూస్తున్నారు, ఈ లెర్నింగ్ లో భాగంగా స్మార్ట్ ఫోన్ లేని వారికి ఇవి అందిస్తారు.
వారికి పాఠాలు హోం వర్క్ లు ఇలా అన్నీ ఈ స్మార్ట్ ఫోన్ కు సందేశాలు వస్తాయి…స్మార్ట్ మొబైల్స్ లేని పేద విద్యార్థులు చాలా మంది ఉన్నారు వారికి అందించనున్నారు ఈ ఫోన్స్.