ఆపరేషన్ ఆకర్షనలో భాగంగా ఆ రాష్ట్రంపై కన్నేసిన బీజేపీ….

ఆపరేషన్ ఆకర్షనలో భాగంగా ఆ రాష్ట్రంపై కన్నేసిన బీజేపీ....

0
29
MLA Raja Singh

కర్ణటక మధ్యప్రదేశ రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ణతో చక్రం తిప్పి ఆయా రాష్ట్రాల పీఠాలను కైవసం చేసుకున్నకమలనాధులు నేడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్ పై పడినట్లు వార్తలు వస్తున్నాయి… రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు కష్టాలు ఎదురవుతున్నాయి… ఏకకాలంలో అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటు రాజ్యసభ పదవులకు పొందేందుకు కాషాయ నేతలు పక్కా కార్యచరణతో పావులు కదుపుతున్నట్లు స్పష్టమైన సంకేతాలందడంతో నిలువరించే యత్నాల్లో కాంగ్రెస్ నాయకులు జారిపోకుండా జగ్రత్త పడుతోంది…

ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే తాజాగా రాజస్తాన్ లోనూ ఇదే తరహా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి….తమ ప్రభుత్వాన్ని ఆస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం చీఫ్ మహేష్ జోషి ఆరోపించారు.. బేసారాలతో తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రభుత్వానికి మద్దతునిస్తున్నస్వతంత్రులను కోనేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు… దీనిపై డీజీపీకి లేఖ కూడా రాశారు.. ఈనెల 19న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి…

ఇందులో రాజాస్తాన్ నుంచి 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇక రాజ్యసభ స్థానం గెలుచుకోవాలంటే 51 మొదటి ప్రధాన్యత ఓటు అవసరం అవుతాయి ప్రస్తుతంకాంగ్రెస్ కు 107 మంది ఎమ్మెల్యేల బలం ఉంది ఇందులో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు 12 మంది స్వతంత్రులు కూడా ఉన్నారు ఇక బీజేపీకి 72 మంది సభ్యులు బలం ఉంది… ప్రస్తుత సంఖ్య బలాన్ని అక్కడ కాంగ్రెస్ రెండు బీజేపీకి ఒక రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది…

కానీ బీజేపీ ఇద్దరు అభ్యర్థులను బరిలో దింపి రాజకీయాంగా కాక పట్టించింది… ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బయటకు లాగే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు… 12 మంది స్వతంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందని మరికొంత మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుంటే రాస్యసభ స్థానాలను గెలుచుకోవచ్చిని బీజేపీ భావిస్తోంది…