పేపర్ లీక్ పై ఫుల్ క్లారిటీ

పేపర్ లీక్ పై ఫుల్ క్లారిటీ

0
43

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన గ్రామ సచివలాయ పరీక్షలీక్ పై రచ్చ జరుగుతోంది…. గ్రామ సచివలాయ ఉద్యోగాలను కేవలం వైసీపీ నాయకులు వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ర్యాంకులు ఇచ్చుకుంటున్నారని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు.

అలాగే దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు రాత్రి పగలు కష్టపడిన నిరుద్యోగి ఉద్యోగం కోసం పరీక్ష రాస్తే వారి ఆశలమీద నీళ్లు చల్లారని విమర్శలు చేశారు. ఇక ఈ విమర్శల నేపథ్యంలో పేపర్ లీక్ పై ఏపీపీఎస్సీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది…

గ్రామ సచివలాయన ఉద్యోగ పరిక్షలకు ఏపీపీ ఎస్సీ పరిక్షలకు ఎలాంటి సంబంధం లేధని తేల్చి చెప్పింది.. ఈ పరిక్ష పంచాయితీ రాజ్ శాఖ నిర్వహించిందని పేర్కొన్నారు… తమ పరిధిలోని అలాగే తాము నిర్వహించిన పరీక్షలపై సమాధానం చెప్పలేమని ఆ సంస్థ చైర్మన్ ఉదయ భాస్కర్ తెలిపారు.