60 వేలకు చేరనున్న బంగారం ధర నిపుణులు ఏమంటున్నారంటే

60 వేలకు చేరనున్న బంగారం ధర నిపుణులు ఏమంటున్నారంటే

0
36

గత ఏడాది కరోనా సమయంలో బంగారం ధర దాదాపు 58000 వరకూ చేరింది.. అయితే కరోనా సమయంలో అందరూ బంగారంపైనే పెట్టుబడి పెట్టారు షేర్లు కూడా దాదాపు చాలా వరకూ మార్కెట్ తగ్గింది ..అయితే కరోనా పరిస్దితులు తగ్గిన తర్వాత బంగారంపై కాస్త పెట్టుబడి తగ్గింది.. దీంతో బంగారం ధర తగ్గింది అయితే ఇప్పుడు మార్కెట్లో చూస్తే మళ్లీ కరోనా పరిస్దితుల వల్ల బంగారం ధర పెరుగుతోంది.

 

ఎక్కడ చూసినా బంగారం ధర పెరుగుతోంది కాని తగ్గడం లేదు….తాజాగా నిపుణులు అదే చెబుతున్నారు.. బంగారం ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి కాని తగ్గే ఛాన్స్ లేదు అంటున్నారు.

రానున్న నెలల్లో ఏకంగా రూ.60 వేలకు చేరొచ్చని చెబుతున్నారు. అయితే దీనికి కారణాలు చెబుతున్నారు.

 

గత ఏడాది కూడా కరోనా సమయంలో ధర ఇలాగే ఉంది.. మూడు నెలల్లో భారీగా పెరిగింది.. ఆగస్ట్ లో భారీగా పెరిగింది ధర.. ఇప్పుడు ఇలాంటి స్దితి కనిపిస్తోంది అంటున్నారు… అయితే అవసరం అయితే బంగారం కొనుక్కోవడానికి మంచి సమయం అంటున్నారు… ఇక వెండి కూడా సుమారు 90 వేల వరకూ చేరవచ్చు అంటున్నారు నిపుణులు.