DRDO కొత్త చైర్మన్ గా సమీర్..డాక్టర్ సతీష్​ కు కీలక బాధ్యతలు

0
36

డీఆర్​డీఓ కొత్త ఛైర్మన్​గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులైన ఆయన.. డీఆర్​డీఓ ఛైర్మన్​గానూ వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జి. సతీశ్​ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు.

దేశంలోని అగ్రశ్రేణి రక్షణ శాస్త్రవేత్తగా డాక్టర్ సతీష్​ పేరొందిన వ్యక్తి. అగ్ని, పృథ్వీ, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థల కోసం నావిగేషన్, ఏవియానిక్స్ డిజైన్‌ రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 2018లో సతీశ్​ రెడ్డి డీఆర్​డీఓ ఛైర్మన్​గా నియమితులయ్యారు. 2020లో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. ఇప్పుడు ఆ గడువు పూర్తవగా.. రక్షణ మంత్రికి సలహాదారుగా నియమించింది.