ప‌శ్చిమబెంగాల్ లో మ‌మ‌తా బెన‌ర్జీ పై దాడి

-

ప‌శ్చిమబెంగాల్ లో ఎన్నిక‌ల సంద‌డి క‌నిపిస్తోంది… నువ్వా నేనా అనేలా ఉన్నాయి ప్ర‌చారంలో రాజ‌కీయ పార్టీలు.. ఇక ఈసారి ఎలాగైనా ఇక్క‌డ గెల‌వాలి అని అన్నీ రాజ‌కీయ పార్టీలు పావులు క‌దుపుతున్నాయి.. ముఖ్యంగా తృణ‌ముల్ బీజేపీ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ అనేది క‌నిపిస్తోంది, ఈ స‌మ‌యంలో తాజాగా
ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు.నందిగ్రామ్ లో ఆమె పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తృణ‌ముల్ కు ఇటీవ‌ల రాజీనామా చేసి బీజేపీలో చేరిన కీలక నేత సువేందు అధికారిపై ఆమె పోటీ చేస్తున్నారు. ఇక ఆమె నామినేష‌న్ వేసేందుకు అక్క‌డ‌కు వెళ్లారు.ఈ స‌మ‌యంలో రాత్రి అక్క‌డ బ‌స చేయాల్సి ఉంది.. కాని ఆమె దాడి ఘ‌ట‌న త‌ర్వాత అక్క‌డ నుంచి
కోల్ క‌తాకు ప‌య‌నం అయ్యారు….నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని చెప్పారు. కారు ఎక్కుతున్న స‌మ‌యంలో త‌న‌ని నెట్టారని ఆమె తెలిపారు. ఇక్క‌డ త‌న ప‌ర్య‌ట‌న ఉన్నా ఒక్క పోలీస్ కూడా లేరు అని తెలిపారు, దీని వెనుక కుట్ర ఉంది అని ఆమె ఆరోప‌ణ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఆసియా ఛాంపియన్ ట్రోపీలో పాక్‌కు కాంస్యం.. వంద డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన..

చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ...

DSP గా పోస్ట్ తీసుకున్న బాక్సర్..

హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్‌(Nikhat Zareen)ను డీఎస్‌పీ...