Home రాజకీయం ప్రయాణికులకు బిగ్ అలర్ట్..ఈనెల 31 వరకు 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు

ప్రయాణికులకు బిగ్ అలర్ట్..ఈనెల 31 వరకు 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు

Big alert for passengers.. 55 passenger trains canceled till 31st of this month

0
177

కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పలు ఫ్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు ప్రయాణికులను అలెర్ట్ చేసింది. ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు 55 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే… ఈ రద్దును ఈనెల 31వ వరకు పొడగించినట్లు తాజాగా వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించింది.

రద్దు చేసిన ప్రధాన రైళ్లు ఇవే..

కాచిగూడ-కర్నూల్ సిటీ, మేడ్చల్‌-ఉందానగర్ రైళ్లు రద్దు

కాజీపేట-సికింద్రాబాద్, కాచిగూడ-నడికుడ ప్యాసింజర్‌ రైళ్లు

తిరుపతి-కట్‌పడి, గుంతకల్-డోన్, కర్నూల్ సిటీ-గుంతకల్లు రైళ్లు రద్దు

మేడ్చల్ -సికింద్రాబాద్, సికింద్రాబాద్-ఉందానగర్ రైళ్లు రద్దు

మచిలీపట్నం-విజయవాడ, మచిలీపట్నం-గుడివాడ రైళ్లు రద్దు

రేపల్లె-తెనాలి, విజయవాడ-నర్సాపూర్ ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

నర్సాపూర్-నిడుదవోలు ప్యాసింజర్ రైలు రద్దు