ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌..నేడు పలు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

0
39

హైదరాబాద్‌ వాసులకు ముఖ్య సూచన. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగర పరిధిలోని 20 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దూ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వహణ పనుల కారణంగా కొన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ 20 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు నిర్ణయం కేవలం ఇవాళ ఒక్క రోజే మాత్రమే అని అధికారులు సూచించారు.

రద్దు అయిన రైళ్లు ఇవే.. 

లింగంపల్లి – హైదరాబాద్, హైదరాబాద్‌ – లింగంపల్లి, ఫలక్‌ నుమా – లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్‌ నుమా మార్గాల్లో కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణం చేయాలని అధికారులు సూచనలు ఇచ్చారు. ఈ 20 ఎంఎంటీఎస్‌ రైళ్లు రేపటి నుండి ఎప్పటి లాగే నడుస్తాయని స్పష్టం చేసింది దక్షిణ మధ్య రైల్వే శాఖ.