బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఈ రాష్ట్రాలే: అమిత్ షా

0
46
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో రెండో రోజు తీర్మానాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. సమావేశాల అనంతరం మూడు రోజుల పాటు ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా 2 వందల పార్లమెంట్ నియోజకవర్గాలను గుర్తించారు. కేంద్ర మంత్రులు ఈ పార్లమెంట్ నియోజకవర్గాలకు బాధ్యులుగా వ్యవహరించనున్నారు. రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్‌షా.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కొవిడ్‌, సర్జికల్‌ స్ట్రైక్స్‌ సహా రాహుల్‌గాంధీని ఈడీ ప్రశ్నించినా… రాజకీయమే చేస్తోందన్నారు.
కశ్మీర్‌ను అంతర్జాతీయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై అమిత్‌షా విరుచుకుపడ్డారు. అవకాశవాద, అవినీతి రాజకీయాలకి కాంగ్రెస్‌ వేదికగా మారిందని విమర్శించారు. బంగాల్‌, తెలంగాణలో భాజపా అధికారంలోకి రాబట్టడమే నెక్స్ట్ టార్గెట్ అని  అన్నారు.