జగన్ పీటీషన్ పై సీబీఐ కోర్టు షాకింగ్ డెసిషన్…

జగన్ పీటీషన్ పై సీబీఐ కోర్టు షాకింగ్ డెసిషన్...

0
37

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై గతంలో నమోదైన అక్రమాస్తూల కేసుల విషయంలో తాజాగా సీబీఐ కోర్టు షాకింగ్ డెసిషన్ తీసుకుంది… ఇటీవలే ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ పిటీషన్ వేశారు. తాను ఇప్పుడు సీఎం అయిన తర్వాత తనకు వ్యక్తిగ హాజరునుంచి విముక్తి కావాలని కోరుతూ పిటీషన్ వేశారు..

తనకు బదులుగా తన లాయర్ హాజరు అయ్యేలా అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై తాజాగా కోర్టు విచారణ చేపట్టింది… ఈ మేరకు జగన్ పీటీషన్ పై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ కౌంటర్ దాఖలు చేసింది… జగన్ గతంలో జైల్లో ఉన్నప్పుడు సాక్షాలు ప్రభావితం చేశారని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు…

ఇప్పుడు సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షాలను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో జగన్ వ్యక్తిగత మినహాయింపు కోరడం సరికాదని సీబీఐ అభిప్రాయ పడింది. విజయవాడ నుంచి రావడం కష్టమేమికాదని పేర్కొంది.