పవన్ విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం..

పవన్ విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం..

0
38

విశాఖ జిల్లా వేధికగా 3న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించనున్నారు. ఈ లాంగ్ మార్చ్ కు ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు ఇవ్వాలని పవన్ కోరారు… ఈ మేరకు చంద్రబాబు నాయుడుకు, కన్నాలక్ష్మీనారాయణకు రామకృష్ణలకు ఫోన్ చేసి చెప్పారు…

ప్రజల కోసం చేసే ప్రతీ కార్యక్రమానికి టీడీపీ మద్దతుగా నిలుస్తోందిన అన్నారు… తాజాగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ… తమ పార్టీ తరపున సీనియర్ నాయకులు పాల్గొంటారని అన్నారు… ఇసుక కొరత కారణంగా జరిగిన ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలే అని అన్నారు…

పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోవడం వల్లే ఏపీలో ఇసుక కొరత ఏర్పడిందని అన్నారు… వరదల కారణంగా ఇసుక తవ్వలేకపోతున్నాని ప్రభుత్వం చెబుతోందని మరి తెలంగాణలో వర్షాలు పడుతున్నా అక్కడ ఇసుక కొరత లేదని అన్నారు… దీనికి ప్రభుత్వం ఏం చెబుతుందని ప్రశ్నించారు…