సీఎం జగన్ కలువనున్న ఆనం….

సీఎం జగన్ కలువనున్న ఆనం....

0
153

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలువనున్నారు… ఇటీవలే ఆయన చేసిన వ్యాఖ్యలకు జగన్ మోహన్ రెడ్డి సీరియన్ అయ్యారు… దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు అందుకే ఆయన నేడు వివరణ ఇచ్చేందుకు తాడేపల్లి జగన్ మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు….

కాగా స్వచ్చమైన తేనె కావాలంటే వెంటగిరికి రండి… ఏ ఇతర మాఫియా కావాలన్నా నెల్లూరు నగరానికి వెళ్లండని అంటూ నెల్లూరు జిల్లాలో ప్రాతినిత్యం వహిస్తున్నా అనిల్ అలాగే శ్రీధర్ రెడ్డిలని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు… ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నసంగతి తెలిసిందే….

కాగా ఆనం వైఎస్ మరణం తర్వాత కూడా కాంగ్రెస్ ఉన్నారు… 2014 ఎన్నికల సమయంలో టీడీపీ తీర్ధం తీసుకున్న అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేక పోయారు 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తీర్ధం తీసుకుని వెంకటగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఆనం…